టైగర్ ఈజ్ బ్యాక్.. హైదరాబాద్​ చేరుకున్న గ్లోబర్ స్టార్ ఎన్టీఆర్

-

అమెరికాలోని లాస్ ఏంజెల్స్​లో జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఎన్టీఆర్ ఇవాళ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్న తారక్​కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అభిమానులకు తారక్ అభివందనం చేశారు.


అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆస్కార్ వేడుకపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ అవార్డు అందుకున్న క్షణం తాను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. నాటు నాటుకు ఆస్కార్ వచ్చిన విషయం మొదటి తన భార్య ప్రణతితో షేర్ చేసుకున్నానని ఎన్టీఆర్ తెలిపారు.

‘ఆస్కార్‌ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా అనిపించింది. స్టేజ్‌పై కీరవాణి, చంద్రబోస్‌ నిల్చొని అవార్డును తీసుకున్న ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోను. అదే నా బెస్ట్‌ మూమెంట్‌. మేము ఇంతటి గౌరవాన్ని దక్కించుకున్నామంటే దానికి కారణం అభిమానులు, సినీ ప్రియులు. వాళ్ల ప్రేమ, ఆశీస్సుల వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ప్రోత్సహించిన ప్రతి భారతీయుడు, సినీ ప్రియుడికి నా కృతజ్ఞతలు.’ అని ఎన్టీఆర్‌ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news