బాలీవుడ్ ఫేట్ మార్చనున్న పఠాన్..!

-

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా ఈయన నుంచి ఒక్క సరైనా హిట్ కూడా లేదు. దీంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. కానీ దాదాపు నాలుగు సంవత్సరాలు తర్వాత మళ్లీ భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు షారుఖ్ ఖాన్. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను జనవరి 25వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

గత మూడు సంవత్సరాలలో ఏ బాలీవుడ్ సినిమా కూడా ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కాలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమా ఐదు లక్షల టిక్కెట్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే అమ్ముడుపోయాయి అనే సమాచారం కూడా అందుతోంది. భారీ అంచనాల మధ్య యశ్ రాజు ఫిల్మ్స్ వారు నిర్మించిన ఈ భారీ బడ్జెట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఓపెనింగ్ కలెక్షన్స్ రూ. 100 కోట్లు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరుతుందని అంటున్నారు.

ఇకపోతే గత మూడు సంవత్సరాల కాలంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ గడ్డు కాలాన్ని చవిచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కి ఊపిరి పోసే విధంగా ఈ సినిమా కలెక్షన్లు ఉంటాయి అని మొదటి నుండి షారుఖ్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరిగాయని కూడా వినిపిస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా కలెక్షన్లతో బాలీవుడ్ ఫేట్ మారిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news