పవన్ కల్యాణ్ కోసం అంత పని చేసిన నిఖిల్..ఫ్యాన్స్ హ్యాపీ..

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘కార్తీకేయ-2’ ఫిల్మ్ ను దేశవ్యాప్తంగా సినీ లవర్స్ విశేషంగా ఆదరిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రికార్డు వసూళ్లు చేస్తోంది. కాగా, ఈ సినిమా ప్రదర్శన విషయమై నిఖిల్ తీసుకున్న నిర్ణయం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.

జనసేనాని పవన్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన నటించిన పాత సినిమా ‘జల్సా’ ను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 4 కే ట్రైలర్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయగా, అది బాగా వైరలవుతోంది. జనాలు ఆ సినిమా ట్రైలర్ చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలోనే ‘జల్సా’ ప్రదర్శన కోసం హైదరాబాద్ లోని దేవి 70 ఎంఎం థియేటర్ లో అవకాశం ఇవ్వాలని నిఖిల్ థియేటర్ యాజమాన్యాన్ని కోరారు.

అలా ‘జల్సా’ సినిమా రీ-రిలీజ్ కోసం నిఖిల్ తన ‘కార్తీకేయ-2’ చిత్రాన్ని నిలిపేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకుని ఫ్యాన్స్ నిఖిల్ కు థాంక్స్ చెప్తున్నారు.

నిఖిల్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే పవన్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు నిఖిల్.

పవన్ బర్త్ డే సందర్భంగా దాదాపు 500లకు పైగా స్క్రీన్స్ లో సెప్టెంబర్ 1 నుంచి ‘జల్సా’ ఫిల్మ్ ను రిలీజ్ చేయనున్నారు. ‘జల్సా’తో పాటు ‘తమ్ముడు’ మూవీని కూడా రీ-రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే పవన్ బర్త్ డే సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి అప్ డేట్ రాబోతున్నదని పవన్ అభిమానులు అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news