వ్యూహం సినిమా కలెక్షన్ల లాగే.. వైసీపీ సీట్లు – రఘురామ

-

వ్యూహం సినిమా కలెక్షన్లు ఎంతైతే దారుణంగా ఉన్నాయో… రేపు పోలింగ్ బూతుల్లో వైకాపాకు ఓట్లు కూడా అంతే ఘోరంగా ఉండబోతున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. వ్యూహం సినిమా కలెక్షన్లు దారుణం అయితే అంతకంటే ఘోరమైన పరాభవాన్ని వైకాపా చవిచూడనుందన్నారు.
రాయలసీమ ప్రాంతంలో వైకాపాకు 20 నుంచి 25 స్థానాలు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో 15 స్థానాలను కలుపుకొని మొత్తంగా 40 స్థానాలు వస్తాయని ఇన్నాళ్లు భావించామని, కానీ ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే సింగల్ డిజిట్ కు పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు.

raghurama on vyuham and ycp

వ్యూహం సినిమా ద్వారా ప్రజలు వైకాపాకు ఒక టీజర్ లాంటి షాక్ ఇచ్చారని, వైకాపా శ్రేణులు ఓటమిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఓడిపోయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టనున్న ఓదార్పు యాత్రకు, ఇంకా పార్టీలో పనికిమాలిన వారు ఎవరైనా మిగిలి ఉంటే వారు సిద్ధంగా ఉండాలన్నారు. అంతలోనే రఘురామకృష్ణ రాజు గారి గోశాలలోని గోమాత గజ్జల చప్పుడు చేయడంతో ఇది నిజమని, గోమాత కూడా నిజమనే చెబుతోందని ఆయన అన్నారు. తాను పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి అభిమన్యుడిని కాదు… అర్జున్ రెడ్డి అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి గారు, తన వ్యూహంలో తానే చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు పన్నిన వ్యూహంలో నుంచే బయటకు రాలేదని, ఇంక పద్మవ్యూహంలో నుంచి బయటకు ఏమి వస్తావంటూ రఘురామకృష్ణ రాజు గారు అపహాస్యం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version