BREAKING : ఈ నెల 28వ తేదీన విజయవాడకు రజనీకాంత్, బాలయ్య

-

 

ఈ నెల 28వ తేదీన విజయవాడకు రజనీకాంత్, బాలయ్య రానున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు రజనీకాంత్, బాలయ్య, చంద్రబాబు. ఎన్టీఆర్ చారిత్రాక ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేయనుంది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ. ఈ కార్యక్రమం నిర్వహించే ప్రాగంణంలో పనులు ప్రారంభిస్తూ భూమి పూజ చేశారు కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్, టీడీపీ నేతలు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ ‌ఛైర్మన్ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ… ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని.. ఈ నెల 28వ తేదీన జరిగే సభకు చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరిస్తామని… ఎన్టీఆర్ వెబ్ సైట్, సావనీర్ హైదరాబాద్ లో త్వరలోనే ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్‌ యాప్ ను నారా లోకేష్ ప్రారంభిస్తారని… రామారావు గారికి రామారావుగారే సాటి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news