ల‌క్ష్మీఎస్ ఎన్‌టీఆర్ తీయడం వెనుక ఉన్న నిజాన్ని చెప్పిన వ‌ర్మ‌..!

-

సంచ‌లన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాకు సంబంధించిన అఫిషియ‌ల్ ట్రైల‌ర్ నిన్న ఉద‌యం వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా విడుద‌లైన విష‌యం విదిత‌మే. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా ట్రైల‌ర్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన కొద్ది వ్య‌వ‌ధిలోనే ల‌క్ష‌ల వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్ జాబితాలో నిలిచింది. అలాగే ఇప్పుడు టాలీవుడ్ సినీ ప్ర‌పంచంలో ఎవ‌రిని చూసినా ఈ ట్రైల‌ర్ గురించే చ‌ర్చించుకుంటున్నారు. అయితే ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా తీయ‌డం వెనుక ఉన్న అస‌లు వాస్త‌వాల‌ను వ‌ర్మ వెల్ల‌డించారు.

ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా తీయ‌డం వెనుక ఉన్న కార‌ణాల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని స్వ‌యంగా ఎన్‌టీఆరే త‌న‌ను అడిగార‌ని వ‌ర్మ తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఓ వాయ‌స్ మెసేజ్‌ను కూడా వ‌ర్మ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎన్‌టీఆర్ 1989 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయి, అధికారం కోల్పోయిన స‌మ‌యం నుంచి జ‌రిగిన సంఘ‌ట‌నలను వ‌ర్మ ఈ వీడియోలో తెలిపారు.

25 సంవ‌త్స‌రాలుగా ప్ర‌జ‌లు నిజ‌మని న‌మ్ముతున్న అబ‌ద్దాల‌ను శాశ్వ‌తంగా నిజం అన‌బ‌డే గోతిలో పాతిపెట్ట‌డం ఈ సినిమా ఉద్దేశ‌మ‌ని వ‌ర్మ తెలిపారు. కాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ను కూడా ఇప్ప‌టికే వ‌ర్మ ప్రారంభించారు. ఈ క్ర‌మంలో వర్మ విడుద‌ల చేసిన వాయిస్ మెసేజ్ కూడా నెట్‌లో వైర‌ల్ అవుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news