లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాకముందే సైకిల్‌కు పంక్చర్ పడింది..!

-

అప్పట్లో మీడియా లేదు. అందుకే ఎన్టీఆర్ జీవితంలో చివరి రోజుల్లో ఏం జరిగిందనే దానిపై ఎవ్వరికీ సరైన క్లారిటీ లేదు. అందుకే.. ఆసమయంలో నిజంగా ఏం జరిగిందో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపించారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాకముందే సైకిల్‌కు పంక్చర్ పడిందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సెటైర్ వేశారు. సినిమా విడుదల చేద్దామని అనుకున్నప్పుడు సైకిల్ జోరు మీదుందని.. ఇప్పుడు మాత్రం సైకిల్‌కు పంక్చర్ పడిందన్నారు. విజయవాడలోని ఫిలిం చాంబర్‌లో ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈసందర్భంగా మాట్లాడిన ఆర్జీవీ.. 25 ఏళ్ల క్రితం జరిగిన నిజమైన సంఘటననే తాను ఈ చిత్రంలో చూపించానన్నారు. తన సినిమాలో అన్నీ వాస్తవాలే ఉంటాయన్నారు.

అప్పట్లో మీడియా లేదు. అందుకే ఎన్టీఆర్ జీవితంలో చివరి రోజుల్లో ఏం జరిగిందనే దానిపై ఎవ్వరికీ సరైన క్లారిటీ లేదు. అందుకే.. ఆసమయంలో నిజంగా ఏం జరిగిందో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపించారు. ఓ వ్యక్తిని నమ్మి ఎన్టీఆర్ పెద్ద తప్పు చేశారు. ఆ వ్యక్తి ఎన్టీఆర్‌ను ఏం చేశారో.. మీరు థియేటర్‌లో చూడండి. నేను కాంట్రవర్సీని మాత్రమే సినిమాగా తెరకెక్కించా. కానీ.. చంద్రబాబు మాత్రం సినిమానే కాంట్రవర్సీ చేశారు.. అని వర్మ తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో ఈనెల 31న రిలీజ్ కానుంది. తెలంగాణలో రిలీజ్ చేసినప్పుడే ఏపీలో కూడా రిలీజ్ చేయాలని భావించినప్పటికీ… ఏపీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేయనీయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news