ప్రధానిగా కేఏ పాల్‌, సీఎంగా పవన్‌ కళ్యాణ్‌..వీడియో షేర్‌ చేసిన RGV

-

సంచనాలు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ టాలీవుడ్‌ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ.. రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్‌ చేస్తూ… కౌంటర్లు పేల్చుతుంటారు. ముఖ్యంగా రాజకీయ నేతల బయోగ్రఫీ లపై సినిమాలు తీస్తూ ఉంటారు.

అయితే.. తాజాగా ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ పై సెటైర్లు పేల్చారు. తాను ప్రధాని అవుతానంటూ కేఏ పాల్‌ మాట్లాడిన వీడియోను ఆర్జీవీ షేర్‌ చేయడమే కాకుండా… దానికి పవన్‌ కళ్యాణ్‌ ను కూడా ట్యాగ్‌ చేయడం హైలేట్‌ గా నిలిచింది. అసలు వివరాల్లోకి వెళితే..

“పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అంతా ప్రజా శాంతి పార్టీలో చేరండి. మొత్తం 42 ఎంపీలు గెలిచి.. ప్రధాని అవుతాను. అప్పుడు ఏపీ సీఎం గా పవన్‌ కళ్యాణ్‌ అవుతాడు. నా మాట అలకించి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి పవన్‌ కళ్యాణ్‌ సిద్ధం కావాలి” అంటూ కేఏ పాల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే… ఆ వీడియోను ఆర్జీవీ షేర్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news