రామ్ చరణ్ పై #RRR మూవీ టీం భారీ కుట్ర..? అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీకి కారణం అదేనా ?

-

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన రాజమౌళి భారీ బడ్జెట్ ముల్టీస్టార్ర్ర్ మూవీ #RRR ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఈ సినిమాలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు లభించింది..థియేట్రికల్ పరంగా ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో..OTT లో విడుదలైన తర్వాత అంతకు పడి రేట్లు ఎక్కువ సక్సెస్ ని సాధించింది..నెట్ ఫ్లిక్ సంస్థ వారు ఈ సినిమాని హిందీ వెర్షన్ లో స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు 12 వారాల పైన నుండే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతూనే ఉంది..ముఖ్యంగా ఈ సినిమాకి ఇతర దేశాల నుండి వీక్షికులు ఎక్కువ అయిపోయారు..ఒక ఇండియన్ సినిమాని ఇతర దేశాల వారు ఈ రేంజ్ లో చూడడం చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పొచ్చు..హాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా ని చూసి ప్రశంసలతో ముంచి ఎత్తుతున్నారంటే మాములు విషయం కాదనే చెప్పాలి.

ఇది ఇలా ఉండగా OTT లో విడుదలైన తర్వాత ఇద్దరి హీరోలకు విదేశీయుల నుండి ప్రశంసల వర్షం కురిసింది..కానీ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి..రామ్ చరణ్ ని ప్రముఖ హాలీవుడ్ దర్శక నిర్మాతలు జేమ్స్ బాండ్ తో కూడా పోల్చారు..సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసిన అవే కనిపించేవి..కానీ ఈమధ్య కాలం లో రామ్ చరణ్ కంటే ఎక్కువగా ఎన్టీఆర్ కి ఎక్కువ పేరు రావడం విశేషం..ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ కి ఈసారి వీళ్ళు వెళ్లారంటూ ఒక లిస్ట్ సిద్ధం చేసింది..ఆ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండడం విశేషం..అయితే ఇది RRR మూవీ టీం చేయించిందని.. #RRR ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ రాఫ్టర్ క్రియేషన్స్ వెయ్యి డాలర్లు ఇచ్చి ఎన్టీఆర్ పేరు ని కావాలనే నమోదు చేయించారని.. ఆ రాఫ్టర్ క్రియేషన్స్ అధినేత ఎన్టీఆర్ అభిమాని అంటూ ఆధారాలతో సహా మెగా అభిమానులు సోషల్ మీడియా లో పెట్టారు.. అది బాగా వైరల్ అయిపోవడం తో స్వయంగా రాఫ్టర్ క్రియేషన్స్ వారే మాకు..ఆ వెరైటీ మ్యాగజైన్ కి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది..అయితే ఈరోజు ఎన్టీఆర్ అమిత్ షా భేటీ కూడా RRR టీం ప్లానింగ్ అంటూ మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఇటీవలే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ కి ఎంపికైన సంగతి మన అందరికి తెలిసిందే.. ఆయన రికమండేషన్ తోనే ఎన్టీఆర్ కి అమిత్ షా తో మీటింగ్ పెట్టించాడని సోషల్ మీడియా లో మెగా అభిమానుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.. అంతే కాకుండా అమిత్ షా కూడా ఈమధ్య కాలం లో సౌత్ ఇండియన్ స్టార్ హీరోలతో మంచి కనెక్షన్స్ ని ఏర్పాటు చేసుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే.. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ని, టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని BJP పార్టీ కి మద్దతుదారులు లాగ మలుచుకోవడానికి అమిత్ షా ప్రధాన పాత్ర పోషించడానికి..ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కి చెక్ పెట్టడానికై ఎన్టీఆర్ ని మచ్చిక చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఏది ఏమైనా ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ పరిశ్రమలోనూ పెద్ద ప్రకంపనలే సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news