నెమలిలా కాలేజీలో నాట్యం చేసిన సాయిపల్లవి..వీడియో వైరల్

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి నటించిన తాజా చిత్రం ‘విరాట పర్వం’ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాదు..ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగ రాస్తుందని చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయిపల్లవి చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నది. తాజాగా ఏపీలోని విశాఖపట్నం విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజ్ కు టీమ్ తో కలిసి వెళ్లింది. అక్కడ విద్యార్థులతో సినిమా విశేషాలు పంచుకుంది.

ఈ క్రమంలోనే తన తొలి చిత్రం ‘ఫిదా’లోని ‘వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే’ పాటకు డ్యాన్స్ చేసి అలరించింది. విద్యార్థులంతా కేరింతలతో ఆమెను ఎంకరేజ్ చేసి వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news