సల్మాన్ అంటే ఇంత పిచ్చా..పరుగులు పెడుతున్న జనం..

-

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌ దసరా కానుకగా విడుదల అయ్యింది. బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌తో పాటు నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు..మోహన్‌ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే గాడ్‌ఫాదర్‌ ప్రదర్శితమవుతోన్న ఓ థియేటర్‌లో అభిమానులు అత్యుత్సాహం చూపించారు.

థియేటర్‌లోనే టపాసులు కాల్చి హడావిడి చేశారు. దీంతో చూస్తున్న ప్రేక్షకులు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.మహారాష్ట్రలోని మాలేగావ్‌లోని ఓ థియేటర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో తార్‌మార్‌ సాంగ్‌ ప్లే అవుతోన్న సమయంలో కొంతమంది అభిమానులు థియేటర్‌లోనే బాణసంచా పేల్చారు . దీంతో థియేటర్‌లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. చూస్తున్న ప్రేక్షకులు థియేటర్ బయటకు పరుగులు తీశారు. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

‘ఇదెక్కడి మాస్‌ రా మావా’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే మరికొందరు థియేటర్‌లో ఇలాంటి పనులు అసలు సహించ రాదు అంటూ మండిపడుతున్నారు. సల్మాన్‌ నటించిన అంతిమ్‌ రిలీజైనప్పుడు కూడా కొందరు అభిమానులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సల్లూ భాయ్‌ ఇలాంటి పనులు చేయవద్దని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ అభిమానులు మాత్రం పెడచెవిన పెట్టారు. గాడ్‌ఫాదర్‌ థియేటర్లోనూ మళ్ల అదే పని చేశారు. కాగా ఈలో సల్మాన్‌ మసూం భాయ్‌ పాత్రలో నటించారు. స్ర్కీన్‌పై కనిపించేంది కొద్దిసేపే అయినా కు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు..మొత్తానికి ఈ ఘటన చర్చలకు దారి తీసింది..మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news