కోట్ల రూపాయలతో ఇల్లు కొనుగోలు చేసిన సమంత?..

-

సమంత రూత్ ప్రభు ముంబైలో విలాసవంతమైన మూడు పడక గదుల అపార్ట్‌మెంట్ కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె హైదరాబాద్‌లో కంటే ముంబైలోనే ఎక్కువ సమయం విషయం తెలిసిందే… కొన్ని రోజుల పాటు అనారోగ్యంతో బాధ పడిన సినీ నటి సమంత ఇప్పుడు మళ్లీ తన కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టిని సారించింది. ఆమె మయోసిటిస్ నుండి కోలుకున్న వెంటనే ముంబైకి బయలుదేరి ‘సిటాడెల్’లో పని చేయడం ప్రారంభించింది. మరోవైపు సమంత గురించి ఒక వ్యాఖ్య వైరల్ అవుతోంది.

సామ్ పర్మినెంట్ గా ముంబైకి మకాం మారుస్తోందనేదే ఆ వార్త. రానున్న రోజుల్లో ఆమె బాలీవుడ్ పై పూర్తి స్థాయిలో దృష్టిని సారించబోతోందని… ఈ క్రమంలో అక్కడ ఉండేందుకు ముంబైలో ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. మూడు పడక గదులున్న ఆ ఇంటికి ఆమె రూ. 15 కోట్లు చెల్లించిందని చెపుతున్నారు. అయితే ఈ అంశంపై సమంత నుంచి కానీ, ఆమె టీమ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘సైటడెల్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version