క్రాక్ మీద నమ్మకంతో శృతిహాసన్ అంత డిమాండ్ చేస్తోందా ..?

-

శృతిహాసన్ .. ఐరెన్ లెగ్ అన్న పేరు నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిన ఈ బ్యూటీ ని అందరూ మర్చిపోయారు. ఇక సౌత్ సినిమాలలో శృతిహాసన్ కనిపించదనుకుంటున్న సమయంలో సడన్ గా దర్శనమిచ్చింది. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో హీరోయిన్ గా మళ్ళీ చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. హిట్ కాంబినేషన్ ద్వారా మరోసారి టాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శృతిహాసన్ ఈ సినిమా గ్యారెంటీగా సక్సస్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది.

 

దాంతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ లోను శృతిహాసన్ ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ శృతిహాసన్ కాంబినేషన్ లో వచ్చి సెన్షేషనల్ హిట్ అయిన గబ్బర్ సింగ్ ఆ తర్వాత కాటమరాయుడు లో నటించిన ఈ జంట మరోసారి స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారనగానే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. అంతేకాదు వకీల్ సాబ్ పక్కా హిట్ అంటూ చెప్పుకున్నారు.

 

అయితే ఈ క్రేజ్ వల్లనో లేక రవితేజ తో నటించిన క్రాక్ సినిమా మీద ఉన్న నమ్మకంతోనో గాని వకీల్ సాబ్ కోసం భారీగా డిమాండ్ చేస్తుందట. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ కాకపోయినప్పటికి చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చేలా దర్శకుడు వేణు శ్రీరాం హీరోయిన్ పాత్రని మలిచాడు. ఒక సాంగ్ కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే సినిమాలో ఉంటాయి. దానికి ఏకంగా 70 లక్షలు వరకు శృతిహాసన్ అడుగుతుందని సమాచారం. మరి అందుకు నిర్మాత దిల్ రాజు ఒప్పుకుంటారా లేదా చూడాలి. ఇక ఇపటికే అన్నపూర్ణ స్టూడియో లో వేసిన కోర్ట్ సెట్ లో చిత్రీకరణ జరపబోతున్నట్టు తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news