పెట్రోల్‌ పోసి తగల పెడతాం.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన శ్రీరెడ్డి

-

టాలీవుడ్‌ను మీటూ ఆరోపణలో కుదిపేసిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం కోలీవుడ్‌లో సెటిలైంది. కోలీవుడ్‌లో ఏదో తన మానాన తాను బతుకుతూ ఉంటే.. కావాలని తనపై కామెంట్స్ చేస్తున్నారని రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలపై బూతుల వర్షం కురిపించింది. చాలా రోజుల తరువాత గతవారం లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. రాయలేని, వినలేని పదజాలంతో రాకేష్ మాష్టర్, కరాటే కళ్యాణిలపై విరుచుకుపడింది.

రాకేష్ మాస్టర్‌తో మొదలైన వ్యవహారం.. అక్కడా ఇక్కడా తిరిగి మళ్లీ మెగా ఫ్యామిలీ వద్దే ఆగింది. తానే అందరికీ సాఫ్ట్ కార్నర్ అని అందరూ తననే అంటారని దమ్ముంటే మెగా ఫ్యామిలీని ఒక్క మాటైనా అనగలరా? అని రాకేష్ మాష్టర్ దుమ్ముదులిపింది. తనను సోషల్ మీడియా వేదికగా దూషించిందని సైబర్ క్రైమ్ పోలీసులకు కరాటే కళ్యాణీ ఫిర్యాదు చేసింది. కరాటే కళ్యాణి సైతం లైవ్‌లోకి వచ్చి శ్రీరెడ్డి పేరు ఎత్తకుండా కామెంట్స్ చేసింది.

తాజాగా శ్రీరెడ్డి సైతం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని, రాకేష్ మాష్టర్, కరాటే కళ్యాణిలపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తానిప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తున్నానని, తనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నట్లు తెలిపింది. అయితే కరాటే కల్యాణి, రాకేశ్‌ మాస్టర్‌ తన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. తాను చెన్నైలో కారు, ఇల్లు కొనుక్కున్నానని, దీని గురించి వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. తనను పెట్రోల్‌ పోసి తగల పెడతామని హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే ఫిర్యాదు చేసినట్లు శ్రీరెడ్డి తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news