అమెజాన్ ప్రైమ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ” సర్కారు వారి పాట”

-

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. కాగా ఈ చిత్రం జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ లో “పే పర్ వ్యూ ” పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే గత రాత్రి 12 గంటల నుండి ఈ చిత్రం ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఫ్రీ గా చూడవచ్చు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సముద్రకని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు ముస్తాబవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జులై మొదటి వారంలో షూటింగ్ మొదలుపెట్టనుంది. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news