అమరావతిలో కొత్త వ్యాపారాన్ని స్టాట్ చేయ‌బోతున్న‌ టాలీవుడ్ హీరో..

-

స‌హ‌జంగా దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అని అంటుంటారు. అయితే దీన్ని తూచా త‌ప్ప‌కుండా ప‌లువురు సినీ న‌టీన‌టులు అటు న‌టిస్తూ.. ఇటు ప‌లు వ్యాపారాల్లోనూ దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే సందీప్ కిషన్ కూడా సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నాడు. వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నాడు. తాజాగా మరో బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నాడు.

ఏపీ రాజధాని అమరావతిలో ఓ సెలూన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ రంగంలో పేరుగాంచిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ తీసుకున్నాడు. త్వరలోనే ఈ సెలూన్ ప్రారంభంకానుంది. ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలో సందీప్ నటిస్తున్నాడు. అంతేకాదు, నిర్మాతగా ‘నిను వీడని నీడను నేనే’ సినిమాను తెరకెక్కించి, విజయాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే..!

Read more RELATED
Recommended to you

Latest news