Tharun Bhascker: ‘కీడా కోలా’తో మరోసారి దర్శకుడిగా తరుణ్ భాస్కర్..

-

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం..‘పెళ్లి చూపులు’ ఫిల్మ్ తో సెన్సేషన్ అయిపోయాడు. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత నటుడిగా మారిపోయాడు తరుణ్. పలు సినిమాల్లో కెమియోలు చేయడంతో పాటు కీలక పాత్రలు పోషించాడు.

నెట్ ఫ్లిక్స్ తొలి తెలుగు ఆంథాలజీ ‘పిట్టకథలు’లో ‘రాముల’ సెగ్మెంట్ తీసిన తరుణ్ భాస్కర్..ఇప్పుడు మరోసారి దర్శకుడిగా రాబోతున్నాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. తన తదుపరి చిత్ర టైటిల్, జోనర్ ప్రకటించాడు.

ఇప్పటి వరకు తనకు నచ్చిన విధంగా తాను నటనపైన ఫోకస్ చేసి పలు చిన్న చిన్న కేమియోలు చేశానని, ఇక ఇప్పుడు తను తన వద్దున్న స్క్రిప్ట్ అన్నిటినీ రీ డ్రాఫ్ట్ చేసుకుని చివరకు..మరోసారి దర్శకుడిగా రావడానికి సంసిద్ధమయ్యానని తరుణ్ భాస్కర్ ట్వీట్ లో తెలిపాడు. అలా క్రైమ్ కామెడీ జోనర్ లో ‘కీడా కోలా’ అనే చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ లో వివరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news