ఆ సినిమా దర్శకుడు రాఘవేంద్రరావని తెలియగానే నో చెప్పిన స్టార్ హీరోయిన్..ఎవరంటే?

-

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు..వెండితెరపైన హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తారో తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది కొత్త హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు..సరి కొత్తగా హీరోయిన్లను ప్రజెంట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక్క సినిమా అయినా రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయాలని హీరోయిన్లు అనుకుంటారు. కానీ, ఓ స్టార్ హీరోయిన్ మాత్రం సినిమా దర్శకుడు రాఘవేంద్రరావు అని తెలియగానే సినిమా చేయబోనని చెప్పేసిందట. ఆమె ఎవరో తెలుసుకుందాం.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇటీవల నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ కొత్త సినిమాలు చేస్తున్నారు రాఘవేంద్రరావు. భక్తిరస చిత్రాలనూ తాను చేయగలనని పలు సినిమాలతో రాఘవేంద్రరావు నిరూపించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని చిరంజీవి వరకు..శ్రీదేవి నుంచి మొదలుకుని తాప్సీ పన్ను వరకు చాలా మందిని రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.

కృష్ణం రాజు హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పిక్చర్ ‘త్రిశూలం’. ఈ మూవీలో ఓ హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ స్మిత పాటిల్ ను అనుకున్నారు మేకర్స్. ఆమెను సంప్రదించిన తర్వాత ఫిల్మ్ స్టోరిని స్మిత పాటిల్ కు వినిపించిన క్రమంలో ఆమె ఓకే చెప్పింది. ఇక షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకున్న క్రమంలో ఆమెకు దర్శకుడు కె.రాఘవేంద్రరావు అని తెలిసిందట. దాంతో ఆమె వెంటనే సినిమా చేయబోనని చెప్పేసిందట.

తిరస్కరించడానికి గల కారణమేంటని మేకర్స్ అడగగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మూవీలో ఏదో ఒక్క చిన్న పాయింట్ ను తీసుకుని అస్సలు లాజిక్ లేకుండా మూవీ చేస్తారని, అటువంటి మూవీస్ తనకు నచ్చవని ఆమె చెప్పిందట. అలా ఆమె ‘త్రిశూలం’ మూవీని రిజెక్ట్ చేసిందట. ఇక ఆమె స్థానంలో హీరోయిన్ సహజ నటి జయసుధను తీసుకున్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఇందులో ఇంకో హీరోయిన్ గా అతిలోక సుందరి శ్రీదేవి నటించగా, హీరోగా కృష్ణంరాజు నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news