ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్​.. ఇప్పుడు నిర్మాత కూడా.. తెలుసా?

-

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్​ స్టాటస్​ను అందుకుని ఆ తర్వాత కనుమరుగైపోయారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్​ కూడా ఒకటి. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన ఈ బ్యూటీ.. తక్కువ వయసులోనే తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. హీరోయిన్​గానే కాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్​లో కూడా నటించింది. ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే ఛార్మి.

తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఛార్మీ చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్​లో జూనియర్ ఆర్టిస్ట్​గా ‘ముజ్ సే దోస్తీ కరోగి’ చిత్రంలో నటించింది. తాన్ పదిహేనవ ఏటా తమిళంలో ‘కాదల్‌ అలివదిల్లయ్‌’, మలయళంలో ఆమె చేసిన ‘ కట్టుచెంబాకమ్‌’ రెండు వరుస ఫ్లాపులు అందుకున్నాయి. ఆ తర్వాత తెలుగు లో ‘నీతోడు కావాలి’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ చిత్రం కూడా పెద్దగా హిట్ కాలేదు. అయితే వరుస పరాజయాలతో ఉన్న ఛార్మి కృష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘శ్రీఆంజేనేయం’ చిత్రంతో గ్లామర్ పాత్రలో కనిపించి కుర్రాళ్లకు కిర్రెక్కించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు వచ్చాయి. నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. తర్వాత ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది అయితే నటనకు స్వస్తి చెప్పి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు తీస్తోంది

2017 నుంచి ఛార్మీ తన నటనకు పూర్తిగా స్వస్తి చెప్పి.. నిర్మాణ రంగం వైపు దృష్టి పెట్టింది. అయితే ఇండస్ట్రీలో జరిగే మోసాలు, కుట్రలు.. కుతంత్రాలు, రాజకీయాలు అన్నింటిని తట్టుకొని ఆమె ముందుకు సాగింది. జ్యోతి లక్ష్మి మూవీ లో లీడ్ రోల్ లో నటించి నిర్మాతగా విజయం అందుకుంది. ఆ తర్వాత ఛార్మీ తీసిన చిత్రాలు వరుస ఫ్లాపులు అందుకున్నాయి. ఆ సమయంలోనే రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఛార్మీకి కాస్త ఊరట లభించింది.

అయితే కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ను డ్రగ్స్ మాఫియా ఓ ఊపు ఊపింది. ఇందులో పలువురు సినీ, దర్శక, నిర్మాతలు ఉన్నట్టు వచ్చిన వార్తల్లో.. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి ఛార్మీ తో పలు పలువురు నటులు ఈడీ ముందు హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఛార్మీ వ్యక్తిగత జీవితంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తో ప్రేమలో ఉందని.. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని ఫిలిం వర్గాల్లో వార్తలు దుమారం..  తర్వాత పూరి జగన్నాథ్ తో ఆమె రిలేషన్ లో ఉంటున్నట్టు.. త్వరలో పూరి తన భార్యకు విడాకులు ఇచ్చి వీరిద్దరూ ఒకటి కాబోతున్నట్లు రక రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. తనపై విమర్శలు చేసిన వారికి ఘాటైన సమాధానం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news