పాన్‌ ఇండియా స్టార్‌ తో త్రివిక్రమ్‌ సినిమా !

-

అల వైకుంఠపురంలో మూవీ తర్వాత.. భీమ్లా నాయక్‌కు మాటలు, స్క్రీన్ ప్లే అందించిన త్రివిక్రమ్.. ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే SSMB 28 సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో కాకుండా తెలుగులోనే చేస్తున్నాడు. మహేష్ కూడా రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెడ్తానని క్లారిటీ ఇచ్చాడు. దాంతో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్.

అయితే మహేష్ తర్వాత మాటల మాంత్రికుడు ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. పుష్ప తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు బన్నీ. ఈ క్రమంలోనే త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ సినిమానే త్రివిక్రమ్ ఫస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమాగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’తో.. త్రివిక్రమ్, మహేష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతో ఈ కాంబోలో క్లారిటీ రావాలంటే.. మహేష్ సినిమా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news