BREAKING : రాజ్యసభకు రాజమౌళి తండ్రి.. ప్రధాని మోడీ ప్రకటన

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ రచయిత… సంచలన దర్శకుడు రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పెద్దల సభ అయిన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

vijayendraprasad
vijayendraprasad

విజయేంద్రప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయని… అలాగే ప్రపంచవ్యాప్తంగా… ఒక ముద్ర వేశాయని ఆయన తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. రాజ్యసభకు ఎంపికైనందుకు విజయేంద్ర ప్రసాద్ కు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. అటు దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్‌ చేసిన కేంద్రం.. సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

రాజ్యసభకు ఎంపిక

1. ప్రముఖ అధ్లేట్ పిటి ఉష..

2. ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా..

3. ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్..

4. కర్నాటక లో ని ధర్మస్థల దేవాలయ సంరక్షకుడు..సంఘ సంస్కర్త వీరేంద్ర హెగ్డే

Read more RELATED
Recommended to you

Latest news