మొన్న వంశీ, నిన్న పరశురామ్, నేడు హరీష్…. ఏంటిది మహేష్…??

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తో కెరీర్ పరంగా వరుసగా మూడు సూపర్ హిట్ లు దక్కించుకున్నారు. మహేష్ ప్రక్కన హీరోయిన్ గా రష్మిక నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాలో భారతి అనే ప్రొఫెసర్ గా కనిపించడం జరిగింది. అయితే ఈ సినిమా సక్సెస్ ని తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన మహేష్, ప్రస్తుతం తన తదుపరి సినిమా విషయమై పలువురు దర్శకుల నుండి కథలు వింటున్నారు. అయితే ఇటీవల సరిలేరు ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ మాట్లాడుతూ, తన తదుపరి సినిమాని, మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు మహేష్ మీడియాకు తెలిపారు. అయితే మహేష్ టూర్ నుండి తిరిగివచ్చిన తరువాత ఆయనను వంశీ కలిసారని,

Superstar Mahesh in Sarileru Neekevvaru Interval scene

అయినప్పటికీ కూడా స్క్రిప్ట్ లో చాలావరకు పనులు మిగిలి ఉండడంతో, ఈలోపు మరొక దర్శకుడితో సినిమా చేయాలని మహేష్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో గీత గోవిందం దర్శకుడు పరశురామ్, మహేష్ కు సరిపోయే ఒక వండర్ఫుల్ స్టోరీని ఆయనకు వినిపించడం జరిగిందని, అది నచ్చిన మహేష్, అతి త్వరలో షూటింగ్ మొదలెడదాం అని చెప్పినట్లు కూడా నిన్న వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ అదే ఫైనల్ అంటూ కూడా కొందరు మహేష్ సన్నిహితులు కూడా అన్నారట. అయితే వీటితోపాటు నేడు మరొక దర్శకుడు హరీష్ శంకర్ తో మహేష్ తదుపరి సినిమాని ఫిక్స్ చేసారంటూ ఇంకొక వార్త ప్రచారం అవుతోంది.

 

అతి త్వరలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ కల్యాణ్ తో కలిసి హరీష్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తాను రాసుకున్న మరొక కథకు మహేష్ అయితే కరెక్ట్ అని భావించి, నిన్న మహేష్ ని కలిసి హరీష్ కథను వినిపించడం, దానికి మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమ్ జరిగిందని, అటు పవన్ సినిమాతో పాటు ఇటు మహేష్ సినిమాని కూడా హరీష్ ఒకేసారి తీసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇక మొత్తంగా మొన్నేమో వంశీ, నిన్నేమో పరశురామ్, నేడేమో హరీష్ శంకర్ పేర్లు వినిపిస్తూ మహేష్ తదుపరి సినిమాపై అందరిలోనూ పెద్ద కంఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. మరి ఈ విషయమై అధికారిక ప్రకటన వస్తేనేకాని పూర్తి వాస్తవాలు బయటకు రావు….!!

Read more RELATED
Recommended to you

Latest news