బాక్సాఫీస్ వద్ద 2021 సంక్రాంతికి రసవత్తరమైన పోటీ ..నెగ్గేదెవరో ..?

-

ప్రతీ సంవత్సరం సంక్రాంతి సినిమాలకి పెద్ద సీజన్ అని చెప్పాలి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు చాలా వరకు సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతుంటాయి. అంతేకాదు మన హీరోలందరికి ఈ సీజన్ ఎంతో సెంటిమెంట్ కూడా. ఇక ఈ సీజన్ లో రిలీజయ్యో సినిమాలు దాదాపుగా బ్లాక్ బస్టర్స్ ని సొంతం చేసుకుంటాయి. కొత్త రికార్డ్స్ ని క్రియోట్స్ చేస్తుంటాయి. ఇక ఈ సీజన్ మన టాలీవుడ్ కే కాదు కోలీవుడ్ కి చాలా సెంటిమెంట్. అక్కడ కూడా స్టార్స్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీ పడుతుంటాయి.

 

అలాగే ఈ సారి కూడా మన టాలీవుడ్ స్టార్ హీరోలు 2021 సంక్రాంతికి పోటీ పడబోతున్నారని తాజా సమాచారం. వాస్తవంగా అయితే 2020 డిసెంబర్ లోపే కొన్ని సినిమాలు వచ్చేయాల్సింది. కాని కరోనా కారణంగా ఈ ఇయర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ సినిమాని ఈ ఇయర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కాని ఎప్పటికప్పుడు అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవడం ఆ తర్వాత కరోనా ..దీంతో ఇప్పుడు ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

 

ఇక ప్రభాస్ రాధా కృష్ణ సినిమా కూడా ఈ ఇయర్ రిలీజ్ అయ్యో అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటవలేదు. కాబట్టి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతికే ముస్తాబవుతుందట. బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ బాగా ఉంటుంది. సో గ్యారెంటీగా ఈ సినిమా కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇవే కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సంక్రాంతికే వచ్చేందుకు రెడీ అవుతున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలైనప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా చెప్పారు. మొత్తానికి ఈ సారి 2021 సంక్రాంతి రసవత్తరంగా మారబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news