శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తీసుకోకూడదో తెలుసా?

-

మన భారతీయులకు భక్తి ఎక్కువే..అందుకే కొన్ని నియమాలను కూడా పెట్టుకున్నారు.ఆ రోజుల్లో ఇలా చెయ్యాలి..అలా ఉండాలి అని అనుకుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో చాలా పవిత్రంగా ఉంటారు.వివిధ వ్రతాలు, ఉపవాసాలు ఈ మాసంలో పాటిస్తారు. ఈ శ్రావణ మాసంలో భక్తులు శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.ఈ మాసంలో ప్రతి సోమవారం ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో శ్రావణ సోమవారంగా జరుపుకుంటారు. అలాగే ఈ నెల నుంచి అనేక పండుగలు ప్రారంభమవుతాయి కృష్ణ జన్మాష్టమి, రక్షా బంధన్, నాగ పంచమి వంటి అనేక ముఖ్యమైన హిందూ పండుగలు శ్రావణ మాసంలో వస్తాయి కాబట్టి ఈ మాసం మరింత పవిత్రమైనది.

పూజలు, ఉపవాసాలు, ఉపవాసాలతో పాటు ఈ మాసంలో చాలా మంది భక్తులు మాసం మొత్తం మాంసాహారం మానేసి కేవలం కాయగూరలతోనే భోజనం చేయడం మరో విశేషం. అయితే శ్రావణ మాసంలో మాంసాహారాన్ని ఎందుకు తినరు? దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? సైన్స్ దీని పై ఏం చెబుతుంది..వివరణాత్మక సమాచారం క్రింది విధంగా ఉంది. ముందుగా, ఈ ఆచారం గురించి హిందూ మతం ఏమి చెబుతుందో తెలుసుకుందాం..

వర్షాకాలంలో మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిదని, సూర్యరశ్మి లేకపోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుందని, శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నవారు తేలికగా జీర్ణమయ్యే చిరుధాన్యాలు తినడం మంచిదని పెద్దలు చెబుతున్నారు. వర్షాకాలంలో నీటి వల్ల అనేక రోగాల బారిన పడే జంతువుల మాంసం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా వర్షాకాలంలో మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది.

వర్షాకాలంలో చేపలు, ఇతర జలచరాలు పునరుత్పత్తి చేసినప్పుడు ఇది జల జీవుల సంతానోత్పత్తి కాలం. ఈ సమయంలో జలచరాలను తినడం వల్ల వాటి పునరుత్పత్తి నిరోధిస్తుంది. జలచరాలకు సంతానోత్పత్తి ప్రదేశాలు లేని వర్షాకాలంలో ప్రజలు చేపల, ఇతర రకాల సముద్రపు ఆహారాన్ని తినకుండా ఉండటం వల్ల ఈ ఆచారం ఏర్పడిందని పెద్దలు చెబుతున్నారు..ఇది అసలు మ్యాటర్..

Read more RELATED
Recommended to you

Latest news