సూర్యాస్తమయం తర్వాత వీటిని అస్సలు చెయ్యకండి.. దరిద్రం..

-

సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు అస్సలు చెయ్య కూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.. ఆ పనులు చెయ్యడం వల్ల ఇంటికి దరిద్రం పడుతుందట.. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనుల గురించి మన పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు. సాయంత్రం పూట నిద్రపోకూడదు, తుడుచుకోకూడదు అని పిల్లలకు చెబుతుంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అనేక సమస్యలు వస్తాయి.

 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవి, సరస్వతి దేవి, దుర్గాదేవి ఈ సమయంలో ఇంటికి వస్తారు. అటువంటి పరిస్థితిలో, చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సూర్యాస్తమయం తర్వాత పనులు చేయడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఈ పనులను పొరపాటున కూడా చెయ్యకూడదు..

చాలా మంది సాయంత్రం సమయంలో నిద్రపోతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ సమయంలో నిద్రపోవడం నిషిద్ధంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల ఆయుస్సు తగ్గడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా సాయంత్రం పూట ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి.

సూర్యాస్తమయం, సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చకూడదు. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో ఊడ్చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అందువల్ల ధననష్టం, ఇంట్లో డబ్బు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం అశుభం. ఈ సమయంలో తులసి మొక్కకు నీరు కూడా పోయకూడదు. దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది..దాంతో ధన నష్టం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.వీటిని తప్పక గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news