ఐదుగురిని పెళ్లాడినా.. ద్రౌపదిని పతివ్రత అని ఎందుకంటారో తెలుసా..?

-

మగవాళ్లకు ఒకరి కంటే ఎక్కువ భార్యలు ఉండటం సాధారణం. వారు ఎంతమందితోనైనా పిల్లల్ని కనడం కూడా సర్వసాధారణం. కానీ స్త్రీ అలాకాదు. ఈ సమాజం స్త్రీ, పురుషులకు వేర్వేరుగా నియమాలు రూపొందించింది. పతినే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ.. భర్త తప్ప మరో పురుషుడి గురించి ఆలోచన కూడా రానీయని వారిని పతివ్రతలు అంటున్నాం. మరి ద్రౌపది మాత్రం ఐదుగురిని వివాహమాడింది. ఐదుగిరితోనూ పిల్లల్ని కన్నది. అయినా ఆమెను పతివ్రత అని ఎందుకు అంటాం. ఎందుకంటే.. ఆమె ఐదుగురితో కాపురం చేసింది కానీ ఆ సమయంలో ఆమె పాటించిన కొన్ని నియమాలు ఆమెను పతివ్రతను చేశాయి. ద్రౌపది గురించి మీకు తెలియని మరికొన్ని విషయాలు తెలుసుకుందామా..?

  • ఐదుగురి భర్తలతో కాపురం చేసేటప్పుడు ద్రౌపది చాలా నియమాలు పాటించేది. ఓ భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరకు వెళ్లేటప్పుడు అగ్నిలోంచి నడిచి వెళ్లేది. పునీతుల్ని చేయడంలో అగ్నిని మించినదేముంది. అలా అగ్నిలో నడిచి వెళ్లేటప్పుడు ఆమె పవిత్రతను పొందేది.
  • ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. పాండవులు లెక్కకే ఐదుగురు అని చెబుతారు కానీ ఇంద్రుడే ఇలా జన్మించాడని, ఇంద్రుడి భార్య శచీదేవి ద్రౌపదిగా జన్మించిందని మరో పురాణగాథ.
  • పాండవులు , ద్రౌపది… నవమాసాలు తల్లి గర్భంలో పెరిగి యోనిజులుగా జన్మించినవారు కాదు.. వీళ్లు అయోనిజులు( యోని ద్వారా బయటకు రాలేదు).
  • పాండురాజు భార్యలైన కుంతీమాద్రిలు దుర్వాసన మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. అలా యముడు, ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు తమ వద్దనున్న ఇంద్రుని పంచ ప్రాణాలను పంచ పాండవులుగా అనుగ్రహించి.. జన్మనెత్తేలా చేస్తారు. కాబట్టి పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు.
  • ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది..అది కూడా శిశువుగా పుట్టలేదు ఏకంగా యుక్తవయసుతో జన్మించింది. పాంచాలరాజు అయిన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించింది. అందువల్లే ఈమెను యజ్ఞసేని అంటారు.  యజ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు.
  • పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అనే పేరు, అగ్ని దేవుడి ద్వారా జన్మించడం వల్ల యగ్నసేని అనే పేరు, ఐదుగురికి భార్య అవడం వల్ల మహాభారతి అనేపేర్లు వచ్చాయి. మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది. ఇంటికి వచ్చీ రాగానే అమ్మా నేను ఒక మంచి బహుమతిని గెలుచుకొని తెచ్చాను అని తల్లి కుంతితో అంటాడు. ఐదుగురు సమానంగా పంచుకోండి నాయనా అని అంటుంది. దీనిఫలితంగా పంచాలిగా మారింది ద్రౌపది
  • ద్రౌపదికి కలిగిన సంతానమే ఉప పాండవులు. ధర్మరాజు కు ద్రౌపది కి ప్రతివింధ్యుడు, భీముడికి శ్రుతసోముడు, అర్జునుడికి శ్రుత కీర్తి, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి శ్రుత సేనుడు కలిగారు.

కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు ఇలా ఎంత మందితో అవమానాలు ఎదుర్కొన్న ద్రౌపది.. దురహంకార రాజులను నాశనం చేయడానికే అగ్నిలోంచి పుట్టుకొచ్చింది.  త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని ’ సంహరించిన ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యాన్ని కోల్పోతాడు. ఆ దోష నివారణకు తపస్సు చేస్తున్న కాలంలో రాక్షసుల ఆగడాలకు భయపడిన శచీదేవి అగ్ని దేవుడిని ప్రార్థిస్తుంది. తన భర్త తిరిగివచ్చే వరకూ ఆశ్రయం ఇమ్మని అడుగుతుంది. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడని తెలుసుకుని శచీదేవి.. యజ్ఞ కుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పాంచాలిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news