జగిత్యాల: వామ్మో.. ఇదేం హెచ్చరిక..!

-

మంత్రగాళ్లు తీరు మార్చుకోకపోతే.. చంపేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో 8 మంది మంత్రాలు చేస్తున్నారని కొందరు ‘హెచ్చరిక ఫ్లెక్సీ’ ఏర్పాటు చేశారు. గ్రామంలోని మాంత్రికులు మంత్రాలు ఆపకపోతే చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news