BREAKING : భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా మంత్రి తలసాని

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్‌. యంగ్‌ డైరెక్టర్‌ సాగర్‌ కే, చంద్ర ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే సంయుక్త మీనన్ హీరో రానా సరసన నడుస్తోంది.మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్.ఇది ఇదిలా ఉండగా… భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 వ తారీఖున థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిత్రబృందం భారీ ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాదులోని ఓ ప్రముఖ కన్వెన్షన్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని చిత్రబృందం ఆలోచన చేస్తోంది. అయితే ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ ఎవరు లేకుండానే… నిర్వహించాలని చిత్రబృందం మొదట భావించింది.

అయితే తాజాగా వారి నిర్ణయాన్ని మార్చుకుని… ఓ స్పెషల్ గెస్ట్ ను ఈ ఈవెంట్ కు రప్పించాలని చిత్రబృందం భావిస్తోందట. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్.. స్పెషల్ గెస్ట్ గా ఫైనల్ చేసింది చిత్ర బృందం. మంత్రి కేటీఆర్‌ తో సహా సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా ఈ ఈవెంట్‌ కు స్పెషల్‌ గెస్టుగా రానున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news