మెదక్ : రైతును గొడ్డలితో నరికారు

-

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం బొబ్బిలి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెద్ద గొల్ల వీరన్న అనే 40 సంవత్సరాల రైతు తన వ్యవసాయ పొలం వద్ద జొన్న పంట కావలికి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాధితుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news