వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో ఈరోజు ధరలు

-

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు క్వింటాల్ పత్తి ధర రూ.9,510 పలికింది. అలాగే మిర్చి ధర రూ.16,000లుగా ఉంది. పల్లికాయ రూ.6,300లుగా ఉన్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల విరామం అనంతరం మార్కెట్ మళ్లీ ప్రారంభం కావటంతో రైతులు సరుకులు తీసుకుని వస్తున్నారు. మార్కెట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కాంటాలు వేయాలని దళారులకు అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news