గుడ్ న్యూస్.. 12 వేలకు పైగా టీచర్‌ పోస్టులు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారాయ..? అయితే మీకు శుభవార్త. తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్ ని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. తెలంగాణలో ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 తదితర పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియని మొదలు పెట్టారు. అలానే ఇపుడు తెలంగాణ సర్కార్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చూస్తోంది.

దానికి తగ్గ ఏర్పాట్లని కూడా చేసింది. గురుకులాల్లో దాదాపు 12 వేలకు పైగా టీచర్ పోస్టులని భర్తీ చేస్తోంది. ఇప్పటికే గురుకులాల్లో 9,096 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిని ఇవ్వడం జరిగింది. అలానే మరో మూడు వేల ఖాళీలని భర్తీ చేసేందుకు చూస్తోంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. వచ్చాక నోటిఫికేషన్ ని విడుదల చేయనున్నారు.

తెలంగాణ రెసిడెన్షియల్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ పోస్టుల భర్తీ కోసం ఏర్పాట్లు చేస్తోంది. బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన వాళ్ళు ఎక్కువ మంది వున్నారు. పైగా ఎప్పుడు పోస్టులు పడతాయా అని చూస్తున్నారు. అయితే వారందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అన్ని ఒకే అయ్యిపోతే డిసెంబర్‌ మూడో వారంలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్లు ఈ నెలలోనే రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news