పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె – సీఎం జగన్

-

భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవం, ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతం. మన ఆత్మగౌరవానికి జాతీయ జెండా ప్రతీక. సార్వభౌమాధికారానికి ప్రతీక అన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని తెలిపారు. ప్రపంచంతో పోటీపడి ప్రగతిని సాధిస్తున్నాం. ఆహార ధాన్యాల లోటును దేశం అధిగమించిందన్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రపంచ ఫార్మారంగంలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచానికి అవసరమైన ఔషధాలను అందిస్తున్నామన్నారు ఏపీ సీఎం జగన్.

 

Read more RELATED
Recommended to you

Latest news