భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

-

భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను అధిగ మించడానికి పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం భారత్‌ ఆహార సమృద్ధిని సాధించే ప్రయత్నాల్లో ముందు వరుసలో నిలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో పంటల విషయంలో రసాయనాలపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు, సమతుల్య, ఆరోగ్యకరమైన పోషక ఆహారాన్ని పండిచడం ఒకటే భారత్ ముందు ఉన్న లక్ష్యం..

టెక్నాలజీ మనుషుల జీవణ ప్రమాణాలతో పాటు, ఆహారం లాంటి విషయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. వాతావరణంలో జరుగుతోన్న మార్పులు, విజృంభిస్తోన్న మహమ్మారుల కారణంగా ఎదురవుతోన్న సవాళ్ల నేపథ్యంలో భారత్‌కు మరింత సురక్షితమైన, స్థిరమైన ఆహార వ్యవస్థ ఎంతైన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్తఆవిష్యరణలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అధిక పంటను దిగుమతి చేయడం ద్వారా భారతదేశానికి ఆహార భద్రత సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు ప్రోటీన్లతో కూడిన ఆహారం అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

ఈ విషయంపై ICAR-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్ రిసోర్సెస్, న్యూఢిల్లీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ KC బన్సల్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నాణ్యమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి సైన్స్‌ ఆధారిత అత్యుత్తమ టెక్నాలజీ అందుబాటులో ఉంది. జన్యుపరమైన మార్పులు చేసిన ఆహారం ఉత్పత్తి చేయడానికి నేను జెనిటిక్‌ ఇంజనీరింగ్ విధానాన్ని సూచిస్తాను. అయితే ఇప్పటి వరకు మనం ఆహార ఉత్పత్తి, నాణ్యతలను పెంచడానికి సంప్రదాయమైన విధానాలనే ఉపయోగిస్తున్నాం. కానీ ప్రస్తుత రోజుల్లో ఆహారంలో ఖనిజాలు, పోషక విలువలు పెంచడానికి జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ విధానాన్ని వాడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు..అయితే వ్యవసాయ రంగం మరింత సులువుగా మారేందుకు టెక్నాలజీని వాడేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు..

వ్యవసాయ రంగంలో రావాల్సిన వినూత్న మార్పులపై ది గుడ్‌ఫుడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ వరుణ్‌దేశ్‌ పాండే పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వాలు, పరిశ్రమలు ముందుకు రావాలి. దీని వల్ల వినియోగదారులకు సరైన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఫుడ్‌సైన్స్‌ ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు..అంతేకాదు పర్యావరణ పరిరక్షణ కూడా ఉంది.

ఇక ఆహార ఉత్పత్తిలో విత్తనం ప్రధానమైంది. జన్యుపరమైన మార్పిడి వంటి కొత్త సాంకేతికత ద్వారా తక్కువ రసాయానాల వాడకం, తక్కువ భూమి, నీరు ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తులు అందించేలా విత్తనాల్లో మార్పులు చేయొచ్చు. భారత్‌ ఆహార ధాన్యాల ఉత్పత్తిని రానున్న రోజుల్లో 300 మిలియన్‌ టన్నులకు మించి పెంచాలనుకుంటే సాంకేతికతను వాడాలని ప్రముఖులు చెబుతున్నారు..ఉంది కదా అని ఆహారాన్ని వృధా చెయ్యడం తగదు..సేవ్ ఫుడ్..సేవ్ ఇండియా..

Read more RELATED
Recommended to you

Latest news