స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు… ఇండియాలో కొత్తగా 2593 కరోనా కేసులు నమోదు.

-

ఇండియాలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు కేవలం 1500 లోపే నమోదవుతూ వచ్చిన కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న కరోనా కేసులపై పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచాలని ఆదేశించింది.

ఇదిలా ఉంటే ఆరోగ్య శాఖ ప్రకటించిన నివేదిక ప్రకారం గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 2593 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 15,873 గా ఉంది. కిందటి రోజుతో పోలిస్తే ఇది 794 ఎక్కువ. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 44 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 4,25,19,479 గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5,22,193గా ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 187 కోట్ల వాక్సిన్ డోసులను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news