ఇక నుంచి ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షలు : కేంద్రం

-

ప్రపంచాన్ని మరోసారి కరోనా ముప్పు వణికిస్తున్న తరుణంలో ఇండియా అప్రమత్తమైంది. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్రం ఇవాళ పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ్టి నుంచి ర్యాండమ్‌గా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుదల నేపథ్యంలో  సమావేశం అనంతరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Powered By
Video Player is loading.

చైనా సహా వివిధ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీలకు ర్యాండమ్‌గా నమూనాలను సేకరించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం చైనాలో కరోనా కేసుల సునామీకి ప్రధాన కారణం బీఎఫ్‌.7 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంటే ప్రధాన కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. అక్టోబర్‌లో గుజరాత్‌లో గుర్తించగా.. ఇప్పటి వరకు గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒకే కేసు నమోదైంది. వేరియంట్‌కు ఇంక్యుబెషన్‌ చాలా తక్కువ అని అధికారులు తెలిపారు. అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌లోనూ కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news