ఫ్యాక్ట్ చెక్: గోల్డ్‌కోట్ సోలార్‌తో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందా?

-

ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కవ మోస పూరిత మెసేజ్ లు రావడం చూస్తూనే ఉన్నాము..అవి ఫేక్ న్యూస్ అని తెలియక చాలా మంది మోస పోతున్నారు..ఇప్పుడు మరో ఫేక్ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..అదేంటంటే గోల్డ్‌కోట్ సోలార్‌తో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందనే వార్త తెగ చక్కర్లు కోడుతుంది..నిజానికి అలాంటి డీల్ ను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు..అసలు ఆ వార్త గురించి పూర్తీ సమాచారాన్ని తెలుసుకుందాం..

 

పునరుత్పాదక ఇంధన రంగంలో ‘గోల్డ్‌కోట్ సోలార్’ కంపెనీతో విద్యుత్ మంత్రిత్వ శాఖ సహకరిస్తోందని సోషల్ మీడియా సైట్‌లలో ఒక లేఖ చక్కర్లు చేస్తోంది.లెటర్‌హెడ్ ప్రకారం, సోలార్ పవర్ ప్లాంట్ల క్రియాశీల నిర్మాణం ద్వారా 2030 నాటికి 450 GW విస్తరించాలనే ప్రభుత్వ ఇంధన ప్రణాళికను పూర్తి చేసే హక్కు కంపెనీకి ఇవ్వబడింది. సహకార కాలం 21-06-2020 నుండి 20-06-2030 వరకు 10 సంవత్సరాల వరకూ చేసారని అందులో పేర్కొన్నారు..

అయితే, పైన పేర్కొన్న రంగంలోని కంపెనీతో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకోనందున దావాలో నిజం లేదు.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లెటర్‌హెడ్ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేసింది, ఈ ప్రాజెక్ట్‌లో పేర్కొన్న కంపెనీతో భారత ప్రభుత్వం సహకరించలేదు.ఈ రోజుల్లో, నేరుగాల్లు ప్రజల మనస్సులలో గందరగోళాన్ని సృష్టించడానికి చాలా నకిలీ నివేదికలను సృష్టిస్తున్నారు. అందువల్ల, సోషల్ మీడియా సైట్‌లలో చాలా తప్పుడు సమాచారం ప్రసారం చేయడంలో ఆశ్చర్యం లేదు..అందుకే ఇలాంటి వాటిని చూసినప్పుడు ఒకటికి పది సార్లు ఆలొచించాలి..

Read more RELATED
Recommended to you

Latest news