మస్సాజ్ పార్లర్ ముసుగులో “చెడు వ్యవహారాలు”.. పోలీసుల దాడి !

-

ఈ మధ్యన మసాజ్ పార్లర్ల చాటున అసాంఘిక కార్యకలాపాలు జరగడం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాము. అలా చేస్తూ అడ్డంగా దొరికినపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. మాగుంట లే అవుట్ పరిసర ప్రాంతంలో ఒక మసాజ్ సెంటర్ ను నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. అయితే ఎలాగో పోలీసులకు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

ఇక్కడ దాడులు నిర్వహించిన పోలీసులు నలుగురు మహిళలు మరియు ఇద్దరు ఈ ప్రోగ్రాం ను నిర్వహిస్తున్న వారిని అక్కడిక్కడే పట్టుకున్నారు. పట్టుకున్న వారిలో ఒక లేడీ నార్త్ ఇండియా కు చెందిన వారుగా గుర్తించారు. ఇంకా మసాజ్ ముసుగులో ఇంకా ఏమేమి జరిగాయన్నది పోలీసుల విచారణలో తెలియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news