అయ్యో నారా లోకేశ్.. మళ్లీ పప్పులో కాలేశాడు..!

-

నారా లోకేశ్.. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి… సీఎం చంద్రబాబు ముద్దుల తనయుడు.. రాజకీయాల్లోకి వచ్చి చాలా ఏళ్లు అయినా ఇంకా రాజకీయాలు ఒంటపట్టలేదు లోకేశ్ కు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయనకు అలవాటు. తండ్రిలా దాచుకోవడం తెలియదు. భోళా స్వభావం. ఒక్కోసారి ఏం మాట్లాడుతడో ఆయనకే అర్థం కాదు. అంటే.. తెలియనితనంతో మాట్లాడుతడు. తెలియనితనంతో ట్వీట్లు చేస్తుంటాడు.. పోస్టులు చేస్తుంటాడు. దీంతో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతాడు. ఇక.. దొరికిండు కదా అని నెటిజన్లు కూడా ఆయనతో ఓ ఆట ఆడుకుంటరు.

ఇటీవల ఆయన చేసిన ఓ పోస్టు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈసందర్భంగా స్వచ్ఛతే సేవ కార్యక్రమం గురించి లోకేశ్ ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. చెత్తను శుద్ధి చేస్తామని.. ఆ వ్యవస్థ తమ వద్ద ఉందని.. శుభ్రతకే తమ ఓటు అంటూ చెప్పాడు. చెత్త నుంచి సంపద కూడా సృష్టిస్తామని చెప్పబోయి… సంపద నుంచి చెత్తను సృష్టించే కార్యక్రమాలకు ఏపీ శ్రీకారం చుడుతోందంటూ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు లోకేశ్.

అవునా.. మీరు గ్రేట్ సర్.. సంపద నుంచి చెత్తను సృష్టిస్తారా? ఎంత భాగ్యం.. మీరు ఇటువంటి అద్భుతాలు ఇంకా ఎన్నో చేయగలరు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా లోకేశ్ ను నెటిజన్లు ట్రోల్ చేయడం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలోనూ చాలా సార్లు ఆయన ట్రోలింగ్ కు గురయ్యాడు. తర్వాత తన తప్పు తెలుసుకొని మళ్లీ పోస్ట్ ను ఎడిట్ చేసి సరి చేశాడు లోకేశ్.

Read more RELATED
Recommended to you

Latest news