పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా..? ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..

-

చాలా మందికి ఉదయం లేవగానే టీ, లేదా కాఫీ వేడిగా తాగకుంటే మాత్రం చాలా మందికి పొందు గడవదు..ఆఫీస్‌లో, రోడ్డు పక్కన బడ్డీకొట్టు ఎక్కడ పడితే అక్కడ టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో ఇచ్చేవారు..ఇప్పుడు టీ మాత్రం డిస్పోజబుల్‌ పేపర్ గ్లాసులు వచ్చాయి. నేటి కాలంలో అనేక మంది టీ తాగడానికి పేపర్ కప్పులను వినియోగిస్తూంటారు.. ప్లాస్టిక్ కప్పుల కన్నా వీటిలో తాగితే ప్రమాదం అని నిపుణులు అంటున్నారు..

 

పేపర్ కప్పులలో వేడి ద్రావనాలను తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట..దీనిపై కొన్ని పరిశోధనలు కూడా జరిపారు..పేపర్ కప్పుల్లో రోజుకు మూడు సార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున వేడి వేడి టీ తాగితే.. 75 వేల హానికర మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించారు. ఈ విధంగా శరీరంలోకి చేరే ప్లాస్టిక్‌ క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలకు కారణమవుతుందని రుజువు చేశారు..

నిజానికి ఈ పేపర్ కప్పులను హైడ్రో ఫోబిక్ ఫిల్మ్ పొరతో తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతర పదార్థాలతో కూడా పేపర్ కప్పులు తయారవుతాయి. టీ వంటి వేడి ద్రవాలను పేపర్ కప్పులలో పోయగానే దానిలో ఉండే ప్లాస్టిక్ పొర సులభంగా కలిసిపోయి టీ ద్వారా శరీరంలోకి చేరుతుంది. అందువల్లనే వీలైనంత వరకు పేపర్ కప్పులలో టీ, కాఫీలు తాగడానికి దూరంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు స్టీల్, గాజు గ్లాసులను వినియోగిస్తే చాలా మంచిదని చెబుతున్నారు.. బయట టీ తాగేవారు కాస్త ఆలోచించండి..

Read more RELATED
Recommended to you

Latest news