మతిమరుపు ఉందా? అయితే చాక్లెట్లు తినండి!

-

మతిమరుపు అనేది మానవ సహజం. ఇది కొంతమేరకు బాగానే ఉంటుంది. అధికం అయితే కొన్ని పరిణామాలకు దారితీస్తుంది. మతిమరుపు అనేది వయసు మీదపడిన వారిలో ఎక్కువగా ఉంటుంది. దాన్ని అధికమించేందుకు చాక్లెట్లు తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఎలాంటి చాక్లెట్లు తినాలి. వేటిని తినకూడదో తెలుసుకుందాం.

చాక్లెట్‌ తినమంటే తామేమీ చిన్న పిల్లలం కాదని అంటుంటారు. కానీ, మతిమరుపు అనేది పిల్లలకు మాత్రమే రాదు. పెద్దలకు కూడా వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుంటుంది. దీనికి విరుగుడుగా చాక్లెట్లు తినమంటున్నారు వైద్యులు.
– మతిమరుపును దూరం చేయాలనుకుంటే ప్రతిరోజూ చాక్లెట్లు తప్పనిసరిగా తీసుకోవాలి. సమతులాహారంతోపాటు చాక్లెట్‌ కూడా మీ ఆహారంలో భాగంగా ఉండాలంటున్నారు వైద్యులు.
– ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్లలో ఉండే పాలీ ఫెనాల్స్‌ చర్మానికి గుండె కణాలకు హాని చేసే రసాయనాలను నివారిస్తాయి.
– చాలామందిలో చాక్లెట్లు తింటే దంతాలు పాడైపోతాయనే అపోహ ఉంది. కానీ, చాక్లెట్లు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. దీంతో అది దంతాలకు హాని చేసే ఆస్కారమే ఉండదు. మిగిలిన తీపి పదార్థాలతో పోల్చితే చాక్లెట్‌ పర్వాలేదని పరిశోధనలో తేలింది. కాబట్టి ప్రతిరోజూ చాక్లెట్‌ తినడం వల్ల నష్టమేమీ లేదని వైద్యులు సూచిస్తున్నారు.
– చాక్లెట్‌లో ఆరోగ్యానికి చాలా మేలు చేసే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని బ్రిటీష్‌ డైటిక్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ముఖ్యంగా మిల్క్‌ చాక్లెట్‌లో క్యాల్షియం, విటమిన్‌ బి2, బి12 పుష్కలంగా ఉంటాయని వీతితోపాటు మెగ్నీషియం, రాగి, ఆనుములాంటివి డార్క్‌ చాక్లెట్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news