రూ. 100 ల రసంతో.. పిల్లలు పుట్టడం గ్యారంటీ..!

-

ఆధునిక కాలంలో సౌకర్యాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. సంతానలేమి సమస్య అందులో ఒకటి. సంఘంలో ఎక్కువగా బాధించే సమస్య కూడా. పిల్లలు లేని దంపతులను సమాజం తక్కువగా చూస్తుంటుంది. అందుకే ఈ రోజుల్లో సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య పెరిగింది.

కానీ ఈ చికిత్సలకు లక్షల్లో ఖర్చవుతుంది. అయితే పిల్లలు పుట్టేందుకు అంత ఖర్చు పెట్టాల్సిన పనిలేదంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ రామచంద్ర. కేవలం రూ. 100 ఖర్చుతో తాను పిల్లలు పుట్టేలా చికిత్స చేస్తానంటున్నారు. తాను ఒక్క ఏడాదిలోనే దాదాపు పాతిక మంది వరకూ దంపతులకు ఈ చికిత్స ద్వారా సంతాన భాగ్యం కలిగించాలనని చెబుతున్నారు.

ఇంతకీ ఈ వంద రూపాయల చికిత్స ఏంటంటారా.. పిల్లలు పుట్టని దంపతులకు అందుకు కారణం ఎక్కువగా పీసీఓడీ సమస్య, మహిళలకు పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, క్రమం తప్పి రావడం, గర్భసంచీలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడటం వంటి సమస్యలేనట. మగవాళ్లకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.

ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రకృతిలో అనేక ఔషధాలు ఉన్నాయంటున్నారు డాక్టర్ రామచంద్ర.. పిల్లలు పుట్టని దంపతులు గోధమ గడ్డి రసం క్రమం తప్పకుండా తాగాలని చెబుతున్నారు. 8 రోజులు పెంచిన గోధుమ గడ్డి రసం తాగడం వల్ల పై సమస్యల్లో చాలా వరకూ తొలగిపోతాయంటున్నారు. ఇందు కోసం అవసరమయ్యే కేజీ గోధుమలు 60-70 రూపాయలు అవుతాయి. అవి నెల రోజులు వస్తాయని చెబుతున్నారు.

వీటితో పాటు పునర్నవ ఆకు రసం కూడా తీసుకుంటే ఫలితాలు బాగా ఉంటాయంటున్నారు. ఈ పునర్నవ ఆకు గ్రామాల్లో విచ్చలవిడిగా దొరుకుతుందని రామచంద్ర చెబుతున్నారు. ప్రకృతి అందించే ఈ ఔషధాల గురించి తెలియక చాలా మంది లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని రామచంద్ర అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news