పుట్టగొడుగులు తిని ప్రాణాలు కోల్పోయిన తండ్రికొడుకులు..

-

పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివి.. ఇవి తినడం వల్ల విటిమిన్‌ డీ కూడా బాగా అందుతుంది. ఇంకా ఎన్నో లాభాలు.. అలాంటిది పుట్టగొడుగులు తిని ఎవరైనా చనిపోతారా..? అంటే.. చనిపోతారు.. పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో కొన్ని వరకే మనం తినగలిగినవి.. కొన్ని విషపూరితమైనవి ఉంటాయి.. అలాంటి విషపూరిత పుట్టగొడుగులు తిని.. దక్షిణ కర్ణాటకలో తండ్రి కొడుకూ చనిపోయారు. బెల్తాన్‌గాడీ.. పతువేట్ తాలూకా.. పల్లాడపల్కాలో ఈ ఘటన జరిగింది. 80 ఏళ్ల గురువ, ఆయన కొడుకు 41 ఏళ్ల ఒడియప్ప ప్రాణాలు కోల్పోయారు.
వీళ్ల ఆర్థిక పరిస్థితి చాలా దారణంగా ఉంది.. గురువకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఒడియప్ప కాగా.. చిన్నకొడుకు కర్త. కొన్నాళ్లుగా వీళ్లు తీవ్ర ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. నిండా అప్పులు ఉన్నాయి. పేదరికం చుట్టుముట్టింది. ఈ పరిస్థితుల్లో వారు చనిపోవడం స్థానికులకు ఆవేదన కలిగించింది.

ఎలా జరిగింది..

సోమవారం సాయంత్రం ఊరికి దగ్గర్లోని.. అడవిలోకి వెళ్లిన ఒడియప్ప.. అక్కడ కొన్ని పుట్టగొడుగుల్ని చూశాడు. వాటిని వండుకొని తింటే.. ఆ రాత్రి కూర అయిపోతుందిలే అనుకున్నాడు. వాటిని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఈ రాత్రికి మనం మంచి వంట వండుకుందాం.. అంటూ.. పుట్టగొడుగులు వండాడు. ఆ రోజు ఉదయమే సిటీకి వెళ్లిన కర్త.. రాత్రికి ఇంటికి రాలేదు. దాంతో ఒడియప్ప, గురువ ఆ కూరను అన్నంలో కలుపుకొని తిన్నారు. మంగళవారం కర్త.. ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు ఒడియప్ప శవమై కనిపించాడు. లోపలికి వెళ్లి చూస్తే.. లోపల పెద్దాయన కూడా చనిపోయి ఉన్నాడు. విషయం తెలిసి ఊరోళ్లు.. పరుగున వచ్చారు.
ధర్మస్థల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విషపూరిత పుట్టగొడుగుల కూర తినడం వల్లే చనిపోయారని భావిస్తున్నారు. ఇద్దరి నోటి నుంచి నురగలు బయటకు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది.
ఒడియప్పకు కొంత మానసిక సమస్యలున్నాయి. అప్పుడప్పుడూ అతను ఇంట్లో గట్టిగా అరుస్తాడట… సోమవారం రాత్రి కూడా అలాగే అరిచినా.. చుట్టుపక్కల వాళ్లు పట్టించుకోలేరు. ఎప్పుడూ ఉండేదేగా అనుకుని లైట్‌ తీసుకున్నారు.. అడవుల్లో దొరికే వాటిని తెలిసీ, తెలియకుండా తినవద్దని పోలీసులు కోరుతున్నారు. మనం చేసే చిన్న తప్పులే నిండు ప్రాణాలను తీస్తాయి.. ఏది ఏమైనా..ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Read more RELATED
Recommended to you

Latest news