చిన్న ఐడియా.. జీవితాలనే మార్చేసింది.. టాప్ 10 యంగెస్ట్ బిలీనియర్స్ ఆఫ్ ఇండియా వీళ్లే..!

-

వ్యాపారం చేయాలంటే.. మేధావులై ఉండాలి, బాగా అనుభవం ఉండాలి. తలపండిన వారై ఉండాలి అనేవి ఒకప్పటి మాటలు.. ఇప్పుడు యువతే వ్యాపారాలు చేస్తున్నారు. అంతేనా.. టర్నోవర్ కోట్లల్లో ఉంది. చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. 21వ దశాబ్దంలో యువ వ్యాపావేత్తలు ఇండియన్ మార్కెట్ ను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. స్టార్టప్ లే నేడు బిగ్ బిజినెస్ గా మార్చుతున్నారు. మన భారతదేశంలో.. వ్యాపార అనుభవం లేకుండా.. పెద్దగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. చిన్న స్టార్టప్‌లుగా మొదలై.. నేడు వందల కోట్లు సంపాదిస్తున్న టాప్ 10 యంగెస్ట్ బిలీనియర్స్ ఆఫ్ ఇండియా ఎవరో చూద్దామా..!

1. నితిన్ కామత్

ఆస్తి విలువ – $1.5 బిలియన్‌ అంటే 14వేల 500 కోట్ల రూపాయలు
సంస్థ – జీరోధా
చదువు – ఇంజినీరింగ్
ఇండియాలో ట్రేడింగ్‌కు క్రేజ్ మాములుగా లేదు. ఇన్వెస్టర్స్‌కు ఉపయోగపడేలా వివరాలు అందించే సదుపాయాలు ఇప్పటికీ చాలా తక్కువే అని చెప్పాలి. ఉన్నా కూడా యూజర్స్ చాలా పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసిన నితిన్ కామత్ జీరోదాకు రూపకల్పన చేశాడు. ఇండియాలోనే మొదటి డిస్కౌంట్ బ్రోకరేజ్ ఫర్మ్ అది. 2010లో పెట్టిన జీరోదాకు ఇప్పుడు 50లక్షల మంది యాక్టివ్ క్లైంట్స్ ఉన్నారు.

2. నిఖిల్ కామత్

ఆస్తి విలువ- $1.5 బిలియన్
కంపెనీ – జీరోధా
చదువు – స్కూల్‌ డ్రాపౌట్‌
నితిన్ కామత్ సోదరుడు నిఖిల్ కామత్ ఓ స్కూల్ డ్రాపవుట్. 17 ఏళ్ల వయసులో కాల్ సెంటర్‌లో జాబ్ చేసేవాడు. నిఖిల్ కామత్ ట్రేడింగ్‌లో కి వెళ్దామనే డిసైడ్ తన సోదరుడు నితిన్ కామత్‌తో కలిసి జీరోదాను స్టార్ట్ చేశాడు. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎదుర్కొనే ఇబ్బందులను తప్పించటమే పనిగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నిఖిల్ కామత్ ఆస్తి విలువ 11వేల 100 కోట్ల రూపాయలు. నలభై ఏళ్ల వయస్సు వచ్చేసరికి అన్నదమ్ములిద్దరూ ఇండియాలో సెల్ఫ్ మేడ్ బిలినీయర్లుగా మారారు. చాలా గొప్ప విషయమే కదా..!

3. దివ్యాంక్ తురాఖియా

ఆస్తి విలువ- $1.76 బియిన్లు
కంపెనీ – మీడియాడాట్‌ నెట్‌
చదువు-కామర్స్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్
దివ్యాంక్ తురాఖియా చిన్నప్పటి నుంచి కోడింగ్ మీద పట్టుసాధించాడు. 8 ఏళ్ల వయస్సు నుంచి కోడింగ్ మీద దృష్టి పెట్టిన దివ్యాంక్… కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన పూర్తిస్థాయి గ్రిప్ తెచ్చుకున్నారు. ముంబై మాంజీ కాలేజ్‌లో ఎకనామిక్స్ అండ్ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మీడియా. నెట్ స్థాపించారు. ఆ తర్వాత దాన్ని చైనీస్ కన్సార్టియంకు 900 మిలియన్ డాలర్లకు అమ్మేశారు. ఐఐఎఫ్ఏ వెల్త్ నివేదిక ప్రకారం ఇండియాలో సెకండ్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఆంట్రప్యూనర్ దివ్యాంక్ తురాఖియా. ప్రస్తుతం అతని ఆస్తుల విలువ 12 వేల 500 కోట్ల రూపాయలు ఉంది.

4. అంకిత్‌ భక్తి

ఆస్తుల విలువ- $615 మిలియన్లు
సంస్థ- ఓలా
చదువు- ఐఐటీ బాంబే
దేశంలో ఆటో మొబైల్ అండ్ ట్రావెలింగ్ రంగంలో ఓలాకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఓలా క్యాబ్స్ స్థాపించింది అంకిత్ భక్తినే. ఐఐటీ బాంబేలో చదువు పూర్తి చేసుకున్న తర్వాత 2010లో ఈ సంస్థను స్థాపించిన అంకిత్… అతి కొద్ది కాలంలో రైడ్ షేరింగ్ కంపెనీస్ లో టాప్‌కు ఓలా క్యాబ్స్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌ను డామినేట్ చేస్తున్న టాప్ 2 రైడ్ షేరింగ్ కంపెనీల్లో ఓలా క్యాబ్స్ ఒకటి. ప్రస్తుతం అతని ఆస్తి విలువ రూ. 1600 కోట్ల

5. భవీష్ అగర్వాల్

 ఆస్తుల విలువ- $990 మిలియన్‌లు
సంస్థ- ఓలా
చదువు- ఐఐటీ బాంబే
ఓలాతో విప్లవం తీసుకువచ్చిన కుర్రాళ్లలో భవీష్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఐఐటీ బాంబే నుంచి తనకున్న పరిచయాలతో అంకిత్ భక్తితో కలిసి ఓలాకు ప్లాన్ చేశారు భవీష్. ఓల్ సక్సస్ తో భవీష్‌ రూ. 7500 కోట్లకు అధిపతి అయ్యాడు.

6. విజయ్‌ శేఖర్‌ శర్మ

ఆస్తుల విలువ- $1.3 బిలియన్‌లు
సంస్థ- పేటీఎం
చదువు- దిల్లీ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్
డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఇండియాలో పేటీఎం పేరు తెలియనివారు ఉండరు. కాలేజ్‌లో ఉన్నప్పుడే ఇండియా సైట్. నెట్ క్రియేట్ చేసిన విజయ్ శేఖర్ శర్మ. దాన్ని 1 మిలియన్ డాలర్లకు అమ్మేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ఆన్ లైన్ రిజల్ట్స్ కోసం, క్రికెట్ అలర్ట్స్ కోసం రింగ్ టోన్స్ కోసం One 97 కమ్యూనికేషన్స్ ప్రారంభించిన విజయ్ శేఖర్… 2010 లో దాన్ని పేరెంట్ కంపెనీగా ఉంచి పేటీఎంను ప్రారంభించారు. 2017లో విజయ్ శేఖర్‌ శర్మను ఇండియాస్ యంగెస్ట్ బిలినీయర్‌గా ఫోర్బ్ అభివర్ణించింది. ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ కూడా 300 మిలియన్ డాలర్లను పేటీఎంలో ఇన్వెస్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు పేటీఎంను విజయ్ శేఖర్ శర్మ ఏ రేంజ్ కు తీసుకెళ్లారో. ప్రస్తుతం అతని ఆస్తి విలువ రూ. 17వేల కోట్లు

7. బిన్నీ బన్సాల్‌

ఆస్తుల విలువ- $1.3 బిలియన్లుసంస్థ- ఫ్లిప్‌కార్ట్‌

చదువు- దిల్లీ ఐఐటీలో డిగ్రీ

8.సచిన్‌ బన్సాల్‌

ఆస్తుల విలువ- $1.3 బిలియన్లు
సంస్థ- ఫ్లిప్‌కార్ట్‌
చదువు- దిల్లీ ఐఐటీలో డిగ్రీ
ఇద్దరూ ఐఐటీ దిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లే. బిన్నీ, సచిన్ కలిసి 2007లో ఫ్లిఫ్ కార్ట్ ప్రారంభించారు. మొదట్లో అది ఓ చిన్న పుస్తకాలమ్మే సైట్‌లానే ఇది మొదలుపెట్టారు. 2018 నాటికి ఇండియన్ ఈ కామర్స్ ఇండస్ట్రీలో ఫ్లిఫ్ కార్ట్ దే అగ్రభాగం. దీంతో వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఫ్లిప్ కార్ట్ విలువ రెండులక్షల కోట్ల రూపాయలు.

9. రితేష్‌ అగర్వాల్

ఆస్తుల విలువ- $1.1 బిలియన్లు
సంస్థ- ఓయో రూమ్స్‌
చదువు- కాలేజ్‌ డ్రాపౌట్‌
కాలేజ్ డ్రాప్ అవుట్ రితేష్ అగర్వాల్ ఓయో రూం కాన్సెప్ట్‌తో సాధించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. నేడు ఓయో రూమ్స్ తెలియని వాళ్లు అంటరూ ఎవరూ ఉండరు కదా.. 2021 నాటికి ఇండియాలో యంగెస్ట్ బిలినీయర్‌గా రితేష్ అగర్వాల్‌ను మార్చింది ఓయోనే. తక్కువ బడ్జెట్‌లో చిన్న వసతి గదులను పెద్ద హోటళ్లలో కూడా అందుబాటులోకి తీసుకురావటం ఓయో సక్సెస్ సీక్రెట్. ప్రస్తుతం రితేష్ ఆస్తుల విలువ
 రూ. 8వేల కోట్ల రూపాయలు.

10. దీపేందర్ గోయల్

ఆస్తుల విలువ- $650 మిలియన్లు
ఆస్తుల విలువ- జొమాటో
చదువు- దిల్లీ ఐఐటీలో డిగ్రీ
2008లో ఢిల్లీ ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఫుడీ బే పేరుతో దీపిందర్ గోయల్ దీన్ని ప్రారంభించారు. కొంచెం పాపులారిటీ రావటం మొదలయ్యాక 2010లో జొమాటోగా పేరు మార్చారు. ఆ తర్వాత ఫుడ్ బిజెనెస్‌లో జొమాటో సంచలనం సృష్టించింది. 2014లో, అర్బన్ స్పూన్‌ను సొంతం చేసుకున్న తర్వాత జొమాటో ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం దీపిందర్ గోయల్ ఆస్తి విలువ దాదాపురూ. 2వేల 200 కోట్ల రూపాయలు.
వీళ్ల ఐడియాలు.. ఇప్పుడు మనకు చాలా సాధారణంగా అనిపించవచ్చు..కానీ నాడు ఆ ఐడియాస్ తోనే బిజినెస్ స్టాట్ చేసి.. నేడు ఇంత వెనకేశారు. వ్యాపారం చేయాలంటే.. ఓ హడావిడి చేయనక్కర్లేదు.. పీపుల్ పల్స్ పట్టుకుంటే చాలు.. ఏది క్లిక్ అవుతుందో మనకే తెలుస్తుంది. కొద్ది మొత్తం పెట్టుబడి ఉన్నా స్టెప్ తీసుకోవచ్చు. ఏమంటారు..!

Read more RELATED
Recommended to you

Latest news