వామ్మో..ఈ కప్పలు యమ డేంజర్..చావు కంఫార్మ్..

-

ఈ భూ ప్రపంచం ఎన్నో జీవచరాలకు నిలయం..అందులో కొన్ని మనకు మేలు చేస్తాయి..మరి కొన్ని ప్రాణాలకు హానీ కలిగిస్తాయి.విషపూరితమైన పాములు,తేళ్లను,ఆఖరికి చెట్లను కూడా చూసాము..కానీ కప్పలు మనుషులను చంపుతాయని ఎప్పుడైనా విన్నారా? చనిపోయిన మనిషి కళ్ళు తింటాయని వినే ఉంటారు..చంపటం అనేది విని ఉండరు.. నిజంగానే మనుషులను చంపే కప్పలు కూడా ఉన్నాయట..వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి చూడటానికి చాలా అందంగా ఉన్నా.. చాలా విషపూరితమైనది. ఈ కప్పలను గోల్డెన్ పాయిజన్ కప్పలు అంటారు. అవి సాధారణంగా రెండు అంగుళాలు లేదా కొంచెం పెద్దవి లేదా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ కప్పలు పది మందిని చంపేంత విషం ఇందులో ఉండటం గమనార్హం. శతాబ్దాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని ఉపయోగిస్తారట..

ఎందుకు ఇవి విషపూరితమైనవి అనే దానిపై సమాచారం లేదు. అయినప్పటికీ, వాటి విషం ప్రధానంగా మొక్కలు, విషపూరిత కీటకాల నుండి వస్తుందని నమ్ముతారు. అయితే ఇతర ప్రదేశాలలో ఉన్న కప్పలకు ఎలాంటి విషం లేకపోయినా.. ఈ కప్పల్లో విషం ఉండటం భయాందోళన కలిగించే అంశం. ఈ కప్పలను తాకడం కూడా మరణానికి దారితీస్తుంది. వైద్య పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులు ఈ రకమైన కప్పలను వైద్య రంగంలో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కప్పలు ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. వీటి ద్వారా శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్‌లను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు..

ఈ కప్ప రంగు పసుపు, ఆరెంజ్ లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వివిధ ప్రదేశాలను బట్టి వాటి రంగులు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ కప్పలు వేటాడేవారిపై విష ప్రయోగం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ప్రధానంగా ఈగలు, చీమలు, చెదపురుగులను తింటాయి. బంగారు పాయిజన్ కప్పల శరీరాలు కూడా విషపూరితమైనవి. ఏదైనా ప్రమాదాన్ని గుర్తించినప్పుడు, చర్మం నుండి విషం విడుదల అవుతుంది. ఆ విషం నేరుగా మానవ చర్మంపై పడినప్పుడు మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. వీటి విషం పడగానే మనుషుల హార్ట్ పని చెయ్యడం ఆగిపోయి చనిపొతారని నిపుణులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news