హైదరాబాద్ నుండి షిరిడీ టూర్ ప్యాకేజీ.. రూ.3,500 లోపే… వివరాలు ఇవే..!

-

మీరు షిరిడీ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఐఆర్‌సీటీసీ టూరిజం అందిస్తున్న ఈ ప్యాకేజీ ని చూడాల్సిందే. హైదరాబాద్ నుంచి షిరిడీకి ఒక ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. సాయి సన్నిధి పేరు తో ట్రైన్ టూర్ ప్యాకేజీ ని తీసుకు రావడం జరిగింది. ఇక పూర్తి వివరాలని చూస్తే… 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ, శనిశిగ్నాపూర్ కవర్ అవుతాయి.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూసేస్తే… ప్రతీ బుధవారం ఈ టూర్ అందుబాటు లో ఉండనుంది. రూ.3,170 నుండి ఈ ప్యాకేజీ ధర మొదలు అవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. నెక్స్ట్ డే నాగర్సోల్ రైల్వే స్టేషన్ రీచ్ అవుతారు. అక్కడ నుండి పర్యాటకుల్ని షిరిడీకి తీసుకెళ్తారు. సొంత ఖర్చుల తో షిరిడీలో సాయిబాబా ఆలయాన్ని చూడచ్చు.

సాయంత్రం 4 గంటలకు శనిశిగ్నాపూర్ స్టార్ట్ అవ్వాలి. శని ఆలయాన్ని దర్శించుకోవాలి. అక్కడ నుండి నాగర్సోల్ బయల్దేరాలి. రాత్రి 9.20 గంటలకు నాగర్సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కితే ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతారు. ఇక ధర విషయానికి వస్తే.. ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.3,170, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.3,700 చెల్లించాలి. అదే ఒకవేళ కంఫర్ట్‌లో అయితే ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.4,860, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.5,390 చెల్లించాలి. షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వర్ టూర్ ప్యాకేజీ లని కూడా తెలంగాణ టూరిజం తీసుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news