ఓర్నీ..ఏందయ్యా ఇది..ఓవరాక్షన్ తట్టుకొలేరు సామీ..

-

పెళ్ళి అంటే హడావిడి ఎక్కువగా ఉంటుంది.. పెళ్ళికి ఇంకా ఒక నెల ఉంది అనగా ఎంతో హంగామా చేస్తారు.ఇక ఇంట్లో వాళ్ళు మాత్రం మామూలు రచ్చ చెయ్యరు.. వివాహా వేడుకలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఓ వైపు వరుడి కుటుంబసభ్యులు.. మరోవైపు వధువు బంధువులు.. నూతన జంటను చూసి ఆనంద పడిపోతుంటారు. ఇలాంటి పెళ్లి వేడుకలో.. ఓ వింత ఘటన వెలుగు చూసింది..

పెండ్లి మండపంలోనూ నూతన వరుడు ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతున్న ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోను చూసి నెటిజన్లు ఏంటయ్య ఇది.. పెళ్లిలోనూ వదిలిపెట్టరా..అతన్ని అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కోల్ కతాకు సంబంధించిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

ఆ వేడుకకు సంబంధించిన ఈ వైరల్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో ig_calcutta అనే యూజర్ దీన్ని షేర్ చేశారు.. నెటిజన్లు ఈ ఫన్నీ ఫొటోకు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటో లో కోల్‌కతాకు చెందిన పెండ్లి కొడుకు పెండ్లి మండపం పై ఇద్దరు పురోహితుల తో కలిసి కూర్చున్నాడు. పెండ్లి కొడుకు ల్యాప్‌టాప్‌పై ఏదో పనిచేస్తూ బిజీగా ఉండగా.. పురోహితులు అతన్ని ఆశీర్వదిస్తూ కనిపించారు.వర్క్ ఫ్రం హోం.. నెక్ట్స్ లెవెల్ ఇదేనంటూ యూజర్ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు..

ఈ వైరల్ అవుతున్న ఫోటోలో వరుడు ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నాడనేది క్లారిటీ లేదు. అయినప్పటికీ ఏదో ఎమర్జెన్సీ వర్కే చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండటంతో.. ఇలాంటివి ఎక్కడా చూడలేదంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇది విచిత్రం అనే చెప్పాలి..

https://www.instagram.com/p/ClYhby_tAwV/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news