కళ్లు తెరిచిన అమ్మవారు..క్యూ కట్టిన జనం..ఎక్కడో తెలుసా?

-

అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచిందనే వార్తలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. మొన్నీమద్య కార్తీకమాసంలో ఆంధ్రప్రదేశ్లో అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.. ఈ వార్తను చాలా మంది కొట్టి పడేశారు.. మరి కొంతమంది దేవుడి మహిమ అని అంటే.. ఇంకొంత మంది మాత్రం ఎదో తిరకాసు ఉందంటూ అన్నారు..

ఇది ఇలా ఉండగా.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. తాజాగా వరంగల్‌ నగరంలో అలాంటి అద్భుతమే జరిగిందని భక్తులు చెబుతున్నారు.దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లు గాని, సగం మాత్రమే తెరిచి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అమ్మవారి కళ్లు సడెన్ గా తెరుచుకోవడంతో ఇదంతా దేవి మహిమే అంటున్నారు. అమ్మవారి లీలతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు కొంతమంది ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం క్షణాల్లో వైరల్ అయ్యింది.

తాజాగా వరగంల్‌ వేణుగోపాల స్వామి గుడిలో గోదాదేవి కళ్లు తెరిచిందన్న వార్త క్షణాల్లో అంతటా ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో భక్తులు ఆ వింతను చూడటానికి పోటెత్తారు. కళ్లుతెరిచి దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించు కునేందుకు పోటీపడ్డారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. ఓ భక్తురాలికి దేవత కూడా పూనింది.. ఆమె భవిష్యత్తు గురించి చెప్పింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతున్నాయి… మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news