రెచ్చిపోయిన మావోలు.. బస్సు దహనం..

-

మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు కొన్ని రోజులుగా.. గత కొన్ని రోజులుగా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కొత్తూరు వద్ద గత రాత్రి మావోయిస్టులు ఓ బస్సుకు నిప్పు పెట్టారు. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఆపి.. బస్సులోని ప్రయాణికులను కిందికి దింపేశారు.

తరువాత బస్సుకు నిప్పు పెట్టారు. దీంతో బస్సుకు నిప్పు పెట్టడం అది పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news