లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి!

-

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు బస్సు వెళ్తోంది. ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు జోబ్‌లోని లోయలో పడింది. భారీ వర్షం కారణంగా మూల మలుపు వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడిందని అధికారులు వెల్లడించారు.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

అయితే, ఇటీవల పాకిస్తాన్‌లో రోడ్డు ప్రమాదాలు భారీగా సంభవిస్తున్నాయి. రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలోనే బలూచిస్తాన్‌లో బస్సు లోయలో పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news