తెలంగాణ‌లో నేడు 16వేల క‌రోనా ప‌రీక్షల్లో 20 పాజిటివ్ కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైర‌స్ వ్యాప్తి సాధార‌ణ ప‌రిస్థితికి చేరుకుంటుంది. ప్ర‌తి రోజు పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వహించినా.. 50 లోపే క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. కాగ ఈ రోజు క‌రోనా బులిటెన్ ను కాసేప‌టి క్రితం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 16,701 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

corona-virus

ఈ ప‌రీక్షల‌ల్లో 20 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కాగ మ‌రో 391 ప‌రీక్షల ఫ‌లితాలు రావాల్సి ఉంది. కాగ ఈ రోజు కూడా రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. అలాగే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 7 గురు క‌రోనా వైర‌స్ బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 226 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ ప‌లు దేశాల్లో క‌రోనా విజృంభిస్తుంటే.. మ‌న దేశంలో మాత్రం క‌రోనా కేసుల సంఖ్యంగా క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news